వెంకయ్య నాయుడిపై రజనీ షాకింగ్ కామెంట్స్

16
- Advertisement -

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. వెంకయ్య నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చారు. గొప్ప నాయకుడిని రాజకీయాల నుండి దూరం చేశారన్నారు.

శనివారం సెపియన్స్‌హెల్త్‌ ఫౌండేషన్‌ రజతోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రజనీ.. గొప్ప నాయకునిగా పేరు తెచ్చుకున్న వెంకయ్య నాయుడును రాజకీయాల నుంచి దూరం చేశారని ఆరోపించారు.

ఉప రాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని, ఆయన మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగితే ఎంతో బాగుండేదని రజినీకాంత్ తన మనసులోని మాటను వెల్లడించారు. తర్వాత వెంకయ్య మాట్లాడుతూ…రజినీకాంత్‌ మంచి నటుడని, ఆయనను తానే రాజకీయాల్లోకి రావద్దని చెప్పానన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రాజకీయాల్లోకి రాకూడదని సలహా ఇచ్చానని కూడా తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -