ఒక రోజు వెనక్కి

16
- Advertisement -

వచ్చే వారం ధనుష్ సార్ సినిమాతో పాటు కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కూడా థియేటర్స్ లోకి రాబోతుంది. ఏ రెండు సినిమాలు ఫిబ్రవరి 17 న రిలీజ్ అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. వినరో భాగ్యము విష్ణు కథ ఒక రోజు వెనక్కి వెళ్తుందని ముందు నుండి ప్రచారం ఉంది. తాజాగా సినిమాను ఒక రోజు పోస్ట్ పోన్ చేస్తూ ఆఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ధనుష్ తో పోటీ కాకుండా సోలోగా వచ్చేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు.

కిరణ్ అబ్బవరం సినిమా ఫిబ్రవరి 18న రిలీజ్ కాబోతుంది. సరిగ్గా మహాశివరాత్రి రోజు తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే ప్రమోషన్స్ లో తన జోరు చూపిస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమాతో కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఎస్ ఆర్ కళ్యాణ మండపం తర్వాత సరైన హిట్ కొట్టలేక సతమత మవుతున్న కిరణ్ ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నాడు. టీజర్ , ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి పెంచి బజ్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా హిట్ మీదే కిరణ్ అబ్బవరం ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’ బిజినెస్ ఆధారపడి ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -