ముచ్చటగా మూడో షెడ్యూల్ ఫిక్స్

29
- Advertisement -

త్రివిక్రమ్ – మహేష్ కలయికలో రాబోతున్న సినిమా అప్ డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని క్లారిటీ ఉంది. కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌ డేట్‌ ఏమిటంటే.. తన ఫ్యామిలీతో కలిసి స్పెయిన్‌కు బయలుదేరిన మహేష్ బాబు తిరిగి వచ్చిన తర్వాత, ఈ సినిమా 3వ షెడ్యూల్ ను ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఓ బిగ్ హౌస్ లో 35 రోజుల పాటు జరగనున్న సుదీర్ఘ షెడ్యూల్ లో ఈ సినిమా షూట్ జరగనుంది. ప్రస్తుతం ఆ బిగ్ హౌస్ తాలూకు సెట్ వర్క్ జరుగుతోంది.

పూర్తి ఢిల్లీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కాబట్టి, సినిమాలో ఓ భారీ చేజింగ్ ఫైట్ ఎపిసోడ్‌ ఉందట. ఈ ఎపిసోడ్ షూట్ తోనే ఫిబ్రవరి 20 నుంచి ఈ సినిమా షూట్ ను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు త్రివిక్రమ్. దీనికితోడు ఈ సినిమాకి ఇండియా వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది. అందుకే, మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

కోల్‌కతా సెట్ లో మెగా సాంగ్

బింబిసార-2.. ఎప్పుడంటే

రవీంద్ర కౌశిక్‌…ది బ్లాక్ టైగర్‌ బయోపిక్

- Advertisement -