గ్రీన్ ఛాలెంజ్‌లో జోడి మెకే..

42
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ పర్యటనలో ఆస్ట్రేలియా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేషనల్ చైర్ పర్సన్ జోడి మెకే జూబ్లీహిల్స్‌ జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించి ముందుకు తీసుకువెళ్తునందుకు రాజ్యసభ ఎంపి జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ను ఆమె అభినందించారు.

ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మనమందరం పాల్గొని మొక్కలు నాటడంతోపాటు వాటిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. అనంతరం జోడి మెకే మరో ముగ్గురిని నామినేట్ చేస్తానని మరియు గ్రీన్ ఇండియా చాలెంజ్ చైన్ కొనసాగిస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ వృక్ష వేదం పుస్తకాన్ని గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ జోడి మెకే కు బహుకరించారు.వేదాలు, ప్రకృతి ఫొటోలను చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎన్నారై బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -