లంకతో టీమిండియా తొలి వన్డే

56
- Advertisement -

భారత్‌లో శ్రీలంక తొలి వన్డే నేడు జరగనుంది. టీ20 సిరీస్‌ గెలుచుకున్న భారత్ వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.ఇక ఈ మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు ఓవరికి దక్కుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీ20 సిరీస్‌లో సత్తాచాటిన సూర్యకుమార్ యాదవ్‌కు తుది జట్టులో స్ధానం దక్కుతుందా అన్నది తెలియాల్సి ఉంది.

శ్రేయాస్, సూర్యకుమార్ యాదవ్‌కు ఇద్దరికి తుది జట్టులో చోటుదక్కితే హార్ధిక్ పాండ్యా పూర్తిస్థాయి బౌలర్‌గా జట్టుకు సేవలందించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రిజ్‌లోకి వచ్చే అవకాశం ఉండగా మూడో నెంబర్ బ్యాటర్‌గా కోహ్లీ క్రిజ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. భారత్ బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ జట్టులోకి రావటం భారత్‌కు కలిసొచ్చే అంశం. మొత్తంగా శ్రీలంకతో తొలి వన్డే మ్యాచ్‌ ఆసక్తికరంగా జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -