46 రోజుల పాటు నుమాయిష్..

873
- Advertisement -

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ప్రారంభమైంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 03.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ కొనసాగుతుంది. ఇది 83వ నుమాయిష్ కావడం విశేషం.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ నుమాయిష్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నుమాయిష్‌లో 1500 మంది ప్రదర్శనదారులు, 2,400 స్టాల్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తారు.

పెద్దలకు ఎంట్రీ ఫీజు రూ.40. ఐదేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. నుమాయిష్‌కు వచ్చే ప్రజల కోసం ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నుమాయిష్‌కు సరైన ఆదరణ దక్కలేదు. అయితే ఈసారి నుమాయిష్ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నుమాయిష్ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నుమాయిష్ కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -