నోట్లపై దేవుళ్ల బొమ్మలు ఉండాల్సిందే

151
- Advertisement -

భారత కరెన్సీ నోట్లపై ఇక మీదట దేవుళ్ల ఫోటోలను ముద్రించాలని…ఆ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. భారత అర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మోదీ ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇక మీదట గాంధీ ఫోటోలను ముద్రించకుండా లక్ష్మీ, గణేశ్‌ ఫోటోలను పెట్టాలని అని అన్నారు. మన ఆర్ధిక వ్యవస్థను ట్రాక్‌లో ఉంచాలంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పదని అన్నారు.

ప్రస్తుతం దేశంలో ఆర్థిక వ్యవస్థ అంతగా బాగాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇండోనేషియాలో అత్యధికంగా ముస్లింలు ఉన్నారని అయిన వాళ్లు గణేశ్‌ ఫోటోలను ముద్రిస్తారని అన్నారు. అలాంటి దేశంలో సైతం కరెన్సీపై గణేశుడిని ముద్రించారని చెప్పారు. అదే తరహాలో భారత్ లోనూ వారి చిత్రాలను మనమెందుకు పెట్టుకోవద్దు అని ప్రశ్నించారు. అలా చేస్తే మన దేశం ఇంకా బాగుపడుతుందని చెప్పారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రధానమంత్రికి లేఖ రాస్తానన్న కేజ్రీవాల్.. కొత్తగా ముద్రించే నోట్లపై ఈ బొమ్మలు ఉండాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి..

మోదీకి పోస్ట్‌కార్డు రాసిన ప్రజాప్రతినిధులు

సదర్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి :తలసాని

డార్లింగ్‌ పుట్టిన రోజున ప్రాజెక్ట్‌-కె పోస్టర్‌ రిలీజ్‌

 

- Advertisement -