మునుగోడుతో స్వార్ధ రాజకీయాలకు చెక్‌..

259
gangula
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికతో స్వార్ధ రాజకీయాలకు చెక్ పడనుందని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్‌.సంస్థాన్‌ నారాయణపురంలో మంత్రి గంగుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తే నిజయోజకవర్గ సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.

గత ఎన్నికల్లో గెలుపొందిన రాజగోపాల్‌ రెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించడం కాదు.. కనీసం వినడానికి కూడా గ్రామాలకు రాలేదని విమర్శించారు. కాంట్రాక్టుల కోసం రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు రెఫరెండమని చెప్పారు. రూ.18 వేల కాంట్రాక్టుల కోసం మునుగోడు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డి ఏనాడు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మునుగోడును సైతం అదేలా అభివృద్ధి చేసుకోవాలంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజలు నిజమైన సేవచేసేవారిని గెలిపించాలన్నారు.

ఇవి కూడా చదవండి..

ఉద్యానసాగులో తెలంగాణ టాప్..

కాంగ్రెస్‌ చీఫ్‌గా ఖర్గే..బాధ్యతలు స్వీకరణ

దమ్ముంటే మళ్లీ గెలవండి…కేటీఆర్ సవాల్

- Advertisement -