దమ్ముంటే మళ్లీ గెలవండి…కేటీఆర్ సవాల్

262
ktr
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్‌ పార్టీ అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్…వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతలకు ఘోర పరాభవం తప్పదన్నారు. దమ్ముంటే బండి సంజయ్, రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపాలని డిమాండ్ చేశారు. నోరు తెరిస్తే కూలుస్తాం, జైలుకి పంపుతాం అని బీజేపీ నేతలు అంటారు. ప్రజలు వారి నుంచి ఇది కాదు కోరుకునేది. కేసీఆర్ కంటే తెలంగాణను బీజేపీ నేతలు ఎక్కువ ప్రేమించాలి. అప్పుడే ప్రజల మనసు గెలుచుకోగలరని సూచించారు.

బీజేపీ వాళ్లు తెలంగాణకు చేసిన మంచి పనులు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఒక వ్యక్తికి రూ.18వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వడం ఎందుకు? మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అదివ్వరు. కానీ ఒక వ్యక్తికి రూ.18వేల కోట్లు ఇస్తారు ఇది ఎంతవరకు సమంజసం అన్నారు.

స్వామి గౌడ్, శ్రావణ్ కుమార్, భిక్షమయ్య గౌడ్, పల్లె రవి రాక వల్ల పార్టీకి లాభం జరిగిందన్నారు. త్వరలోనే మరిన్ని చేరికలుంటాయన్నారు. త్వరలోనే మరిన్ని చేరికలుంటాయన్నారు. పార్టీ అందరిని కలుపుకుని పోతుంది. అన్ని కులాలు, మతాలు, వర్గాలను గౌరవిస్తుందని అనే సందేశం మాత్రం బలంగా ప్రజల్లోకి వెళ్లిందన్నారు కేటీఆర్.

ఇవి కూడా చదవండి

ప్రధానికి మునుగోడు పద్మశాలీల లేఖ

దాతృత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్సీ కవిత

మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు షురూ..

- Advertisement -