దేశంలో24 గంటల్లో 5221 కరోనా కేసులు…

63
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 5221 కరోనా కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,00,580కు చేరగా 4,39,25,239 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 47,176 యాక్టివ్ కేసులుండగా 5,28,165 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 215.26 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -