- Advertisement -
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న మునుగోడులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు అమిత్ షా బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
అక్కడ్నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 2.10 గంటలకు అమ్మవారిని దర్శించుకుంటారు. 2.40 గంటలకు సికింద్రాబాద్, సాంబమూర్తి నగర్లోని బీజేపీ కార్యకర్త ఎన్.సత్యనారాయణ ఇంటికి వెళ్తారు. బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 4.30కి మునుగోడు చేరుకుంటారు.
సాయంత్రం 5.00 గంటలకు మునుగోడులో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు.
- Advertisement -