గుజరాత్‌ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

48
sc
- Advertisement -

2002 గుజరాత్‌లో జరిగిన గుజరాత్‌ అల్లర్లలో కేసులో నరేంద్ర మోదీకి సిట్ బృందం క్లీన్‌ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇచ్చిన క్లీన్ చిట్‌ను వ్యతిరేకిస్తూ నాటి అల్లర్లలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కొట్టేసింది.

నాడు అల్లర్ల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జాఫ్రీ సహా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. సాధువులతో వెళుతున్న రైలు కోచ్‌కు దుండగులు నిప్పు పెట్టడం.. 59 మంది సాధువులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీంతో నాడు పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ అల్లర్లలో నాడు గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీకి సిట్‌ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

నాటి మత ఘర్షణలపై తాజా దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని జకియా జఫ్రీ సుప్రీం కోర్టును కోరారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ, రాజకీయ నాయకులు, పోలీసుల పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాజా దర్యాప్తునకు ఎటువంటి ఆధారాల్లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సిట్ 2012 ఫిబ్రవరిలో దర్యాప్తు ముగింపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడమే కాకుండా.. మోదీతోపాటు మరో 63 మందికి సంబంధించి ఎటువంటి ఆధారాల్లేవని పేర్కొంది.

- Advertisement -