రాజ‌కీయాలకు గ‌ల్లా అరుణ గుడ్ బై…

35
Galla aruna
- Advertisement -

రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పారు టీడీపీ నేత‌, మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌కుమారి. ఇవాళ మీడియాతో మాట్లాడిన గ‌ల్లా అరుణ‌..టీడీపీకి తాము పెద్ద దిక్కుకాద‌ని తెలిపారు.

అయితే త‌న కుమారుడు గ‌ల్లా జ‌య‌దేవ్‌కు త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తేల్చిచెప్పారు. తన అనుచరులకు స్వేచ్ఛ ఇచ్చానని, ఎక్కడ నచ్చితే అక్కడ ఉండొచ్చని సూచించానని తెలిపారు. రాజకీయాల్లో చేయని పదవీ లేదు,చూడని రాజకీయం లేదని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా , ఒకసారి మంత్రిగా పనిచేశారు గ‌ల్లా అరుణ‌. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ టీడీపీలో చేరారు.

- Advertisement -