కొద్ది రోజులోనే కొత్త పింఛన్లు- మంత్రి ఎర్రబెల్లి

75
minister errabelli
- Advertisement -

పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెల రూపురేఖలు మారుతున్నాయని..70 ఏండ్లలో జరగని అభివృద్ది..7 ఏండ్ల కేసీఆర్ పాలనతోనే సాధ్యమయ్యిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పర్వతగిరిలో 10 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం, రైతు వేదిక, అంతర్గత సీసీ రోడ్లను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. అనంతరం పర్వతగిరి గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులకు 12 కోట్ల రుణాల చెక్కులను అందించారు.

అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..తెలంగాణ గ్రామాలకు జాతీయ అవార్డులు రావడమే ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. మన ఊరు మన బడితో సర్కారు బడులను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతు బంధు, రైతు భీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంట్‌తో వ్యవసాయం పండగలా మారిందన్నారు. అలాగే మరికొద్దిరోజులోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అరూరి రమేష్,కలెక్టర్ గోపి,ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -