శ్రీవారి సేవలో నయన్-విఘ్నేశ్‌ దంపతులు..

41
nayan
- Advertisement -

గురువారం వివాహ బంధంతో ఓక్కటైన కోలివుడ్‌ జంట నయన తార,విఘ్నేశ్‌ శివన్‌ శుక్రవారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించరుకున్నారు. వీరు తిరుమలలో శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్న నయన్‌ దంపతులకు టీటీడీ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.

తిరుమలలో నయన్‌-విఘ్నేశ్‌ను చూసిన భక్తులు వారితో ఫోటోలు దిగి సంతోషపడ్డారు. అయితే నయన్‌,విఘ్నేశ్‌ ఇప్పటికే ప్రేమికులుగా పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్నా.. ఇప్పుడు భార్యభర్తలుగా రావడం విశేషం. కాగా, నిన్న వైభవంగా జరిగిన వీరి పెళ్లి వేడుకకు టాలీవుడ్‌,బాలీవుడ్‌ నుండి పలువురు ప్రముఖులు హాజరైయ్యారు.

- Advertisement -