ఆచార్య ప్రీ రిలీజ్…అతిథిగా జగన్!

44
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వలో మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. 23న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుండగా అతిథిగా ఏపీ సీఎం జగన్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి హాజరుకానున్నారు.

తొలిసారి చిరంజీవి, రామ్ చరణ్ కలసి పూర్తి స్థాయిలో నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సోనూ సూద్, జిష్పూ సేన్ గుప్తా, వెన్నెల కిశోర్, సౌరవ్ లోకేశ్, కిశోర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, అజయ్, సంగీత, రెజీనా, నాజర్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు.

- Advertisement -