విజయ్‌తో పూరి…మరో పాన్ ఇండియా చిత్రం!

82
vijay
- Advertisement -

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అంటూ బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపొందిస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా తాజాగా మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు విజయ్ దేవరకొండ.

లైగర్ తర్వాత పూరితో మరో ప్రాజెక్టు చేస్తున్నానని….పాన్ ఇండియా సినిమా ఈ నెల 29(రేపు)న అనౌన్స్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

- Advertisement -