అనంతపురంలో తీవ్ర విషాదం..

115
- Advertisement -

అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాగలాపురం మల్లికేతి సమీపంలో హెచ్ఎల్సీ బ్రిడ్జి కుప్పకూలడంతో బొలెరో వాహనం కాలువలో పడింది. బొలెరో వాహనంలో రైతు కూలీలు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. బొమ్మనహల్ మండలం ఉద్దేహల్ గ్రామ సమీపంలోని తుంగభద్ర ఎగువ కాలువ 115/167 కిలోమీటర్ వద్ద నిర్మించిన వంతెనపై బులేరో లగేజీ ఆటో వస్తూ కూలిపోయింది. ఈ ప్రమాదంలో సావిత్రి (30) అనే మహిళ కూలి కాలువలో గల్లంతు అయినట్టు తెలుస్తోంది. మిగతా 29 మందిని కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.

అటువైపుగా వెళ్తున్న స్థానికులు గమనించి చాలా మంది రైతు కూలీలను రక్షించారు. ఈ దారి గుండా అనేక వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో అనేక మంది ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -