15 ఏళ్ళుగా థియేట‌ర్‌కు వెళ్ళ‌లేదు.. ఈ హీరో కోసం వెళ్ళాను..

140
- Advertisement -

నేను గ‌త 15 ఏళ్ళుగా థియేట‌ర్‌కు వెళ్ళ‌లేదు. ఈ హీరో సినిమా కోసం థియేట‌ర్‌కు వెళ్ళి చూశాను అని నటుడు జ‌గ‌ప‌తి బాబు అన్నారు. అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన సినిమా హీరో. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మాత‌. ఇందులో జ‌గ‌ప‌తిబాబు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసేందుకు చిత్ర యూనిట్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా జ‌గ‌ప‌తి బాబు మాట్లాడుతూ.. నేను గ‌త 15 ఏళ్ళుగా థియేట‌ర్‌కు వెళ్ళ‌లేదు. ఈ సినిమా కోసం వెళ్ళి చూశాను. పెద్ద‌గా న‌వ్వని నేను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశాను. మొద‌ట్లో ఈ సినిమా చేయ‌వ‌ద్ద‌ని అనుకున్నా. పెద్ద సినిమాల‌లో న‌టించిన నాకు కొత్త హీరో ద‌ర్శ‌కుడుతో చేయాల‌నిపించ‌లేదు. కానీ ప‌ద్మ‌ మా సోదిరి ఒక‌టికి ప‌దిసార్లు ఈ పాత్ర నేను చేస్తేనే బాగుంటుంద‌ని ఒప్పించారు. స‌రేలే చేద్దాం అని చేశాను. జ‌య‌దేవ్ నాకిష్ట‌మైన వ్య‌క్తి. ఇక సినిమా చేసేట‌ప్పుడు నా పాత్ర పండుతుందా, లేదా అనే అనుమానం కూడా వుంది. కానీ ద‌ర్శ‌కుడు నా అంచనాల‌ను తారుమారు చేసి ప్రేక్ష‌కులు ఎంజ‌య్ చేసేలా చేశాడు. ఈ సినిమా చూశాక నేను చేసిన హ‌నుమాన్ జంక్ష‌న్ గుర్తుకువ‌చ్చింది. ఇలాంటివి తీయాలంటే ద‌ర్శ‌కుడు గొప్ప‌త‌నం చూపించాలి. హీరో అశోక్‌లో త‌ప‌న క‌నిపించింది. ఒక‌టికి రెండు సార్లు సీన్ బాగా వ‌చ్చేదాకా చేసేవాడు. ఇక న‌రేశ్ పాత్ర చాలా క్రూరంగా వుంది. ఒక‌ర‌కంగా జ‌ల‌సీ క‌లిగేలా ఆ పాత్ర చేసి మెప్పించాడు అని తెలిపారు.

- Advertisement -