దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు..

98
India corona
- Advertisement -

దేశంలో కొత్త‌గా 12,830 క‌రోనా కేసులు న‌మోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 3,42,73,300కు చేరాయి. ఇందులో 3,36,55,842 మంది బాధితులు కోలుకోగా, 4,58,186 మంది వైరస్‌ వల్ల మరణించారు. మరో 1,59,272 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 7427 కేసులు, 62 మరణాలు ఉన్నాయి.

గత 24 గంటల్లో 14,667 మంది కోలుకోగా, 446 మంది మరణించారు. ఇప్పటివరకు 1,06,14,40,335 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీచేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక అక్టోబర్‌ 30 నాటికి 60,83,19,915 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రకటించింది. ఇందులో శనివారం ఒకేరోజు 11,35,142 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.

- Advertisement -