ఆర్సీబీపై కేకేఆర్ ఘనవిజయం..

159
rcb
- Advertisement -

ఐపీఎల్ 14 సెకండ్ ఫేజ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది కోల్ కతా నైట్ రైడర్స్. కెప్టెన్‌గా ఇదే తనకు చివరి ఐపీఎల్ అని కోహ్లీ ప్రకటించడంతో ఆర్సీబీ విజయంపై భారీ అంచనాలు నెలకొనగా ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్సీబీ ఘోరంగా పరాజయం పాలైంది.

కోల్ కతా విధించిన 93 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసి జయభేరి మోగించింది. కోల్‌కతా ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్‌), వెంకటేశ్‌ అయ్యర్‌ (27 బంతుల్లో 41 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగారు. వరుణ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ పేలవమైన పర్ఫామెన్స్‌ను కనబర్చింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ చేసిన 22 పరుగులు తప్ప మిగితా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆర్సీబీ 92 పరుగులకే చాప చుట్టేసింది.

- Advertisement -