మంత్రి గంగులకు నూతన బీసీ కమిషన్ ఆహ్వానం..

170
BC Commission
- Advertisement -

రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, సభ్యులు కే.కిషోర్ గౌడ్, సిహెచ్. ఉపేంద్రలు శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్ 1వ తేదీన ఖైరతాబాద్ లోని కార్యాలయంలో పదవీ భాద్యతలు స్వీకరిస్తున్నట్టుగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. ఈ భేటీలో కమిషన్ విధివిదానాలు, భవిష్యత్ కార్యాచరణ ఆయనకు వివరించారు.

ఈ నేపథ్యంగా మంత్రి గంగుల నూతన కమిషన్‌కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో బీసీల, ఎంబీసీల, సంచార కులాల అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆ వర్గాల సమగ్ర వికాసం, అభ్యున్నతికి చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి నిర్ధిష్టమైన సూచనలను ఇవ్వడంలో కమిషన్ గురుతరమైన భాద్యతను స్వీకరించాలని సూచించారు. నూతన కమిషన్ భాద్యతల స్వీకరణ కార్యక్రమానికి బీసీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాల్సిందిగా మంత్రి గంగుల కోరారు.

- Advertisement -