పన్నీర్సెల్వం జయలలిత నమ్మిన బంటు. అక్రమస్తుల కేసులో అమ్మా జైలుకు వెళ్లినప్పుడు సెల్వంకు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగించిపోయింది. ఇటీవలే అనారోగ్య కారణంగా జయలలిత హాస్పటిల్లో చికిత్స పొందుతున్న సమయంలో కూడా పన్నీర్ సెల్వంకు సీఎం పగ్గాలు అప్పజెప్పింది. ఇలా పార్టీ పగ్గాలను అమ్మ అప్పగించినప్పుడల్లా సెల్వం బాధ్యతయుతంగా తన విధులు నిర్వర్తించాడు కానీ అమ్మ మరణాతరం పార్టీలో చిలికలు మొదలైయ్యాయి.
సీఎం సీటు కోసం శశికళ వర్సెస్ పన్నీర్సెల్వం గొడవ మొదలైంది. సీఎం పదవికి నేనే అర్హుడ్ని అని సెల్వం,… కాదు కాదు పార్టీ బాధ్యత మొత్తం నాదే అని శశికళల మధ్య వార్ వన్సైడ్గా జరిగింది. ఇలా జరగడం ఒక్కెత్తు అయితే శశికళ జైలుకు వెళ్లడం మరో ఎత్తు. చిన్నమ్మకు అక్రమస్తుల కేసులో సుప్రీంకోర్టు దోషి అని తెల్చడంతో జైలుకు వెళ్లవల్సి వచ్చింది అయితే ఎట్టి పరిస్థితిల్లో పన్నీర్ సెల్వంను సీఎం కాకుడాదని శశికళ శపథం చేసింది. చివరికి ఆమె ఆనకునట్లే శశికళ అనుచరడు,..చిన్నమ్మ నమ్మిన వ్యక్తి పళనిస్వామిని తమిళనాడు రాష్ట్రానికి సీఎం అయ్యాడు. దీంతో పన్నీర్ ఆశలు ఆవిరైపోయాయి.
ప్రస్తుతం సెల్వం కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడట. అమ్మాడీఎంకే అనే పేరుతో త్వరలో కొత్తపార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయనతోపాటు 11 మందిపై స్పీకర్ అనర్హత వేటు వేయనున్ననేపథ్యంలో… ఆయన వేరే పార్టీలో చేరలేక కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలియవచ్చింది. నిన్న జరిగిన బలనిరూపణలో 11 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే.
దీంతో పన్నీర్తో సహా 11మందిని స్పీకర్ బహిష్కరించి, ఆరునెలల్లోగా ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఆరునెలల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే పన్నీర్కు ఉన్నటువంటి ఏకైక మార్గం పార్టీ పెట్టడం ఒక్కటిగానే కనిపిస్తోంది. ఉమ్మడి గుర్తుతో పోటీ చేయడంపై ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే స్థానంలో అమ్మాడీఎంకే పార్టీ పెట్టాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలియవచ్చింది. దీనికి సంబంధించి ఈసీతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. జయకు నిజమైన వారసుడిని తానేనని చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని, అందుకే ‘అమ్మ’ పేరుతోనే పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలో పన్నీర్ సెల్వం ఉన్నాడట.