అమెరికాలో కాల్పులు..8 మంది మృతి

192
gun
- Advertisement -

అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పెట్రేగి పోయింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోన్‌ పబ్లిక్ ట్రాన్సిట్ మెయింటెనెన్స్ యార్డులో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నిందితుడు సైతం మరణించాడు.

కాల్పుల్లో ఎనిమిది మంది ఉద్యోగులు చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. నిందితుడిని వ్యాలీ ట్రాన్స్‌ఫోర్ట్‌ అథారిటీ ఉద్యోగి 57 ఏళ్ల సామ్‌ కాసిడీగా గుర్తించారు. అయితే, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. ఉదయం 6 గంటల సమయంలో కాల్పులు జరిగాయని…ఆ సమయంలో కనీసం 80 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడిన వారంతా చికిత్స తీసుకుంటున్నారని శాన్‌జోస్‌ మేయర్‌ సామ్‌ లిక్కార్డో పేర్కొన్నారు.

- Advertisement -