కర్ణాటకలో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించగా కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఏడు చోట, రెండు చోట్ల జేడీఎస్, బీజేపీ ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించాయి. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడిపోవడం విశేషం.
()బళ్లారి మహానగర పాలికె (కార్పొరేషన్)లో మొత్తం 39 వార్డులు ఉండగా.. 20 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, బీజేపీ 14 స్థానాలు, ఇతరులు ఐదు చోట్ల గెలిచారు.
()రామనగర నగర సభలో మొత్తం 31 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 19, జేడీఎస్ 11, మరో స్థానంలో ఇతరులు గెలిచారు. బీజేపీ ఖాతా కూడా తెరవలేదు.
()రామనగర జిల్లా చెన్నపట్టణ నగరసభ ఎన్నికల్లో జేడీఎస్ పరువు దక్కించుకుంది. మొత్తం 31 వార్డులకు గాను జేడీఎస్ 16 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 7, బీజేపీ 7, మరో స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి గెలిచారు.
()హాసన్ జిల్లాలోని బేలూరు పురసభలో 23 సీటలో కాంగ్రెస్17, జేడీఎస్5, బీజేపీ1 నెగ్గాయి.
() శివమొగ్గలో భద్రావతి నగరసభలో 35 స్థానాలకు గానూ కాంగ్రెస్ 18, జేడీఎస్ 11, బీజేపీ 4, ఇతరులు రెండు చోట్ల గెలిచారు.
()చిక్కబళ్లాపుర జిల్లా గుడిబండ పట్టణ పంచాయతీ 11 వార్డుల్లో కాంగ్రెస్ 6, జేడీఎస్ 2, ఇతరులు 3 స్థానాలనుగెలుచుకున్నారు.
()మడికెరె నగరసభ ఎన్నికలో మొత్తం 23 స్థానాలకు గానూ బీజేపీ 16, ఎస్డీపీఐ 5, కాంగ్రెస్ 1, జేడీఎస్ 1 స్థానంలో విజయం సాధించాయ.