ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 11,766 కేసలు..

130
corona
- Advertisement -

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 45,581 కరోనా పరీక్షలు చేయగా 11,766 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అదే సమయంలో 4,441 మంది కరోనా నుంచి కోలుకోగా 38 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,579కి పెరిగింది. ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 10,09,228 కేసులు నమోదయ్యాయి.

గడచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,885 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1,593… అనంతపురం జిల్లాలో 1,201… కర్నూలు జిల్లాలో 1,180… శ్రీకాకుళం జిల్లాలో 1,052 కేసులు గుర్తించారు. 9,27,418 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 74,231 మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -