బీజేపీవి మోస పూరిత రాజకీయాలు- మంత్రి

135
minister errabelli
- Advertisement -

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో హన్మకొండలోని స్నేహనగర్ ఎస్.వి కన్వెషన్ హాల్‌లో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి చేస్తున్న మోస పూరిత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పార్టీ కార్యకర్తపై ఉన్నది. పార్టీ టిక్కెట్లు ఆశించి భంగపడిన ఉద్యమకారులకు, పార్టీ ముఖ్య నాయకులకు కేసీఆర్ తగిన స్థానం కల్పిస్తానని తనవంతుగా హామీ ఇవ్వమని చెప్పారు.

కనీసం కరోనా పేషెంట్ల పట్ల జాలి చూపని కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ విక్రయాలను పక్క రాష్ట్రాల్లో 150 రూపాయలకు ఇస్తూ తెలంగాణలో 400 రూపాయలు అధిక ధరలను విక్రయిస్తుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ టికెట్లు ఇవ్వడం జరిగింది. కరోనా విజృంభిస్తున్న వేళ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ.. పార్టీ గెలుపుకై ప్రతి కార్యకర్త పాటుపడాల్సిందిగా కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బింగి శ్రీనివాస్, శివ, రాజు తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలోని GWMC ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకర రవి శంకర్, TSIIC చైర్మన్ గ్యాదరి బాలమల్లు, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు, రైతు రుణవిమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, రాష్ట్ర నాయకులు జన్ను జకార్యా పార్టీ నేతలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -