బెంగాల్‌లో కరోనా వ్యాప్తి.. మ‌మ‌తా బెన‌ర్జీ కీలక నిర్ణయం..

159
didi
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇకపై ఆమె ప్రచారం చేయొద్దని నిర్ణయించుకున్నారు. కోల్‌కతాలో నిర్వహించబోయే ర్యాలీల్లో ఆమె పాల్గొనరని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియెన్ ఈమేరకు తెలిపారు.

కరోనా విజృంభ‌ణ‌ నేపథ్యంలోనే మ‌మ‌త ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయ‌న వివ‌రించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఏప్రిల్‌ 26న మాత్రమే కోల్‌కతాలో మ‌మ‌త ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అలాగే, అంత‌కుముందు జిల్లాల్లో ఆమె పాల్గొనబోయే అన్ని ఎన్నికల ర్యాలీల సమయాన్ని 30 నిమిషాలకు కుదించారని వివ‌రించారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ఇకపై ఎన్నికల ప్రచారం నిర్వహించబోనని, మిగతా రాజకీయ నాయకులకూ ఇదే సూచన చేస్తున్నాన‌ని నిన్న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -