టీమిండియాపై కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రశంసలు..

151
kcr
- Advertisement -

ఆస్ట్రేలియాపై టీమిండియా అనిత‌ర సాధ్య‌మైన విజ‌యం సాధించింది. 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని బ్రిస్బేన్‌లో కంగారూల ప‌ని ప‌ట్టింది. గ‌బ్బా కోట‌ను బ‌ద్ధ‌లు కొట్టింది. 3 వికెట్ల తేడాతో చివరి టెస్ట్‌లో గెలిచి 2-1తో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా టీమిండియాకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు.

కీల‌క ఆట‌గాళ్లు లేకున్నా అద్భుతం చేశార‌ని కేసీఆర్ ప్ర‌శంసించారు. ఈ విజ‌యం చిర‌స్మ‌ర‌ణీయంగా మిగిలిపోతుంద‌న్నారు. కెప్టెన్ ర‌హానేతో పాటు జ‌ట్టు స‌భ్యుల‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. టీమిండియా ఆట‌గాళ్లు భార‌త్‌ను గ‌ర్వించేలా చేశారు అని పేర్కొంటూ రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోయే విజ‌య‌మ‌ని పేర్కొన్నారు. 2021 సంవ‌త్స‌రాన్ని అద్భుతంగా ప్రారంభించారు అని కేటీఆర్ అన్నారు.

- Advertisement -