మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..

209
petrol price
- Advertisement -

పెట్రోల్,డీజీల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత 13 రోజుల్లో 10 సార్లు పెట్రోల్ ధరలు పెరగగా రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ పెట్రోల్‌పై 15పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ 16 పైసలు పెరగ్గా.. లీటర్‌కు రూ.85.80కి చేరింది. డీజిల్‌ 25 పైసలు పెరగ్గా.. రూ.79.27కు చేరింది.

ఢిల్లీలో లీటర్‌కు పెట్రోల్ రూ.82.49, డీజిల్‌ లీటర్‌కు రూ.72.65 చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.89.16, డీజిల్‌ రూ.79.22కి పెరిగింది. మూడు ప్రభుత్వ సంస్థలు ప్రస్తుతం దేశీయ పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను ప్రతి రోజూ సమీక్షిస్తున్నారు.

- Advertisement -