ప్రతిపక్షాలవి కామెడీ మాటలు: బాల్క సుమన్

236
balka suman
- Advertisement -

నేటి నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ అవుతుందని తెలిపారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్‌.…టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రశాంతంగా ఉంటే..ప్రతిపక్షాల్లో సొంతపార్టీ నేతల విమర్శలతో గందరగోళం నెలకొందన్నారు.

టీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో 50శాతంకి పైగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నారు!.…ప్రతిపక్షాల మాటలు ప్రజలకు కామెడీ షో లా అనిపిస్తున్నాయని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ లో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట గెలువలేదు.…పక్క రాష్ట్రంలో దేనికి పనికి రాని వ్యక్తితో హైదరాబాద్ లో రాజకీయాలు ఎంటో వాళ్ళకే తెలియాలన్నారు.

అన్ని పథకాలు మావే అన్న కేంద్రం…30ఏండ్ల లోపు కేంద్ర ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సూచించారు. ఆ హోదా లో హుందా గా ఉండాలి..పార్టీ ఆఫీస్ లలో జర్నలిస్టులను కొట్టిన దుస్థితి ప్రతిపక్షాలు తెచ్చాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తర్ ప్రదేశ్- గుజరాజ్ లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి…ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌ నేతల పై వ్యక్తిగత విమర్శలు మానుకొని దమ్ముంటే అభివృద్ధి పై మాట్లాడాలన్నారు.

- Advertisement -