ఓటు హక్కు వినియోంచుకున్న సోలిపేట సుజాత..

215
dubbaka by elections
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. తన స్వగ్రామం చిట్టాపూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.. కోవిడ్‌ కారణంగా పోలింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచారు అధికారులు. మాస్క్‌ ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. బొప్పాపూర్ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రావు.

- Advertisement -