మొక్కలు నాటిన చిత్రం శ్రీను…

488
chitram srinu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు కమెడియన్ చిత్రం శ్రీను.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని కమెడియన్ చిత్రం శ్రీను అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కమెడియన్ వేణు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండ లోని తన నివాసంలో మొక్కలు నాటిన కమెడియన్ చిత్రం శ్రీను … అనంతరం మరో ముగ్గురు ( కమెడియన్ లు శ్రీనివాస్ రెడ్డి , వెన్నెల కిషోర్ , సత్యం రాజేష్ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -