అమ్మతో కలిసి మొక్కలు నాటిన తరుణ్ భాస్కర్..

391
Director Tharun Bhaskar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి బంజారాహిల్స్ లోని తన నివాసంలో తల్లి గీతా భాస్కర్‌తో కలిసి మొక్కలు నాటారు సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ఎందరో సెలెబ్రెటీస్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారని తెలిపారు.

ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత గానో ఉంది.. కరోనా వల్ల మనం చాలా నేర్చుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి.ఇలాంటి ఛాలెంజ్‌లు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్ననంటూ.. నటులు విజయ్ దేవరకొండ, రీతూ వర్మ,అభయ్ బెతిగంటి ముగ్గురిని నామినేట్ చేశారు తరుణ్ భాస్కర్.

తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ మాట్లాడుతూ.. ఈ ఛాలెంజ్‌లో నేను పాల్గొనడం సంతోషం గా ఉంది. ఈ సమయంలో కూడా దీన్ని ముందుకు తీసుకు వెళ్లడం చాలా గొప్ప విషయం.ఈ ఛాలెంజ్‌ మరింత ముందుకు వెళ్ళాలి. తరుణ్ భాస్కర్ భార్య లతకుఈ ఛాలెంజ్ విసిరారు గీతా భాస్కర్. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ ,కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -