- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మేడ్చల్ పరిధిలో ఉన్న వలస కార్మికులను వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్,మరియు ఇతర రాష్ట్రాలతో చర్చించి వారికి ప్రత్యేకంగా బస్లను ఏర్పాటు చేశారు. క్కుతుబల్లపూర్ ఎమ్మెల్యే వివేకానంద మరియు టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డితో కలసి బస్లను జెండా ఊపి పంపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, మున్సిపాలిటీ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -