వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ మూవీ లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఓటీటీలో కొత్త సినిమాలు హడావిడి చేస్తున్నాయి. రానున్న రోజులలో ఓటిటి ప్లాట్ ఫామ్స్ థియేటర్స్ ను డామినేట్ చెయ్యనున్నాయి. తాజాగా రిలీజ్ కానీ బడా సినిమాలు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 లాంటి ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో డైరెక్ట్గా ఆడియెన్స్ ను పలుకరించేందుకు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉప్పెన కూడా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానుందట.
అంతేకాదు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ యాజమాన్యం చిత్ర నిర్మాతలకి భారీ డీల్ ఇవ్వడంతో ప్రొడ్యూసర్స్ ఓటీటీలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. లాక్డౌన్ లేకపోతే ఏప్రిల్లోనే ఉప్పెన సినిమా ప్రేక్షకులను పలకరించాల్సి ఉంది. ఇప్పటికే మూవీలో రిలీజైన పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఉప్పెన విడుదలకు సిద్ధమవుతోంది.