- Advertisement -
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కష్టమైన దక్షిణాది సినీ పరిశ్రమ కార్మికుల కోసం తనవంతుగా రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ హీరోలు తమవంతుగా సాయాన్ని అందిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన సిబ్బందికి మే నెల జీతాలు కూడా చెల్లించారు. ప్రతిఒక్కరు తమవంతుగా సాయాన్ని అందించాలని కోరిన సంగతి తెలిసిందే.
- Advertisement -

