- Advertisement -
టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రశంసలు గుప్పించారు ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్. టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించగల సత్తా ఉన్న క్రికెటర్ రోహిత్ శర్మ అన్నారు.
టీ20 ఫార్మాట్లో రోహిత్ స్ట్రైక్రేట్ (138.79)గా ఉందని అతడి టైమింగ్ అమోఘం అన్నారు. అందుకే ఏ క్రికెట్ గ్రౌండ్లోనైనా రోహిత్ అలవోకగా సిక్సర్లు కొట్టగలుగుతున్నాడని వెల్లడించాడు.
వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ.. టెస్టుల్లోనూ డబుల్ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. అయితే టీ20ల్లో రోహిత్ అత్యధిక స్కోరు 109 కాగా ఐపీఎల్తో కలిపి మొత్తం ఐదు సెంచరీలను రోహిత్ నమోదు చేశాడు.
టీ20ల్లో ఇప్పటివరకు వెస్టిండిస్ ఓపెనర్ క్రిస్ గేల్(175) అత్యధిక స్కోరు కాగా తర్వాత ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్(172) ఉన్నారు.
- Advertisement -