40 వేల మెజార్టీతో గెలుస్తాం: ఎమ్మెల్సీ పల్లా

450
mlc palla
- Advertisement -

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ ఉత్తమ్ బ్లాక్ మెల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ,హుజుర్ నగర్ ఉప ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి. సూర్యాపేట జిల్లా నెరేడుచర్ల మండల కేంద్రం లో బూత్ కమిటీల ఇంఛార్జిల సమావేశంలో మాట్లాడిన పల్లా ఉత్తమ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కేంద్ర మంత్రి ని అవుతానని ప్రజలను మభ్య పెట్టి ఉత్తమ్ ఎంపీ ఎన్నికల్లో గెలిచారన్నారు.ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ని ఓడగొట్టే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. హుజుర్‌నగర్‌లో గెలుపు టీఆర్ఎస్‌దే……40 వేల మెజార్టీతో గులాబీ జెండా ఎగరేస్తాం అని జోస్యం చెప్పారు.

నిజాయితీ తో, నిబద్ధతతో, పని చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ని గెలిపించాలని కోరుతున్న…అభివృద్ధికి పట్టం కట్టాలని హుజుర్‌నగర్ ఓటర్లను ఓట్లు అడుగుతున్నాం………టీఆర్ఎస్‌ గెలుపుతో హుజుర్‌నగర్‌ దశ మారుతుందన్నారు.

అభివృద్ధికి ముఖ ద్వారంగా హుజుర్‌నగర్‌ని నిలపుతామన్నారు పల్లా. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు,హుజుర్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -