ఏపీలో కరోనా కల్లోలం..

124
corona
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివారల ప్రకారం.. గత 24 గంటల్లో 39,619 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా… ఏకంగా 9,716 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 9,86,703కి చేరింది. మొత్తం 9,18,985 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య 7,510కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 60,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కాగా మూడు జిల్లాల్లో కేసుల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళనను పెంచుతోంది. శ్రీకాకుళం జిల్లాలో 1,444 కేసులు, గుంటూరు జిల్లాలో 1,236 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,180 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 106 కేసులు వచ్చాయి.

- Advertisement -