జమాత్‌లో పాల్గొన్న విదేశీయుల వీసాలు రద్దు..

347
Tablighi Jamaat event
- Advertisement -

తబ్లీగీ జామాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను కేంద్రం బ్లాక్‌ లిస్టులో పెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయం ట్విటర్‌ద్వారా తెలిపింది.

పర్యాటక వీసాలపై వచ్చి తబ్లీగీ కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వ గుర్తించింది. విదేశీయుల చట్టం -1946, విపత్తు నిర్వహణ చట్టం – 2005ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలకు, రాష్ర్టాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -