ఏపీలో కొత్తగా 96 కరోనా కేసులు నమోదు..

127
coronavirus
- Advertisement -

ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 34,778 కరోనా పరీక్షలు నిర్వహించగా 96 కేసులు నమోదైయ్యాయి. అదే సమయంలో 71 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,89,681 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,877 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 635 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారికి చికిత్స కొనసాగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,169కి చేరింది.

కొత్తగా నమోదైన పాజిటీవ్‌ కేసులలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 22 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 17, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో 9 చొప్పున , తూర్పు గోదావరి జిల్లాలో 7 కేసులు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

- Advertisement -