దేశంలో 24 గంటల్లో 8503 కరోనా కేసులు..

114
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 8,503 కరోనా కేసులు నమోదుకాగా 624 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,74,744కు చేరగా 3,41,05,066 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 94,943 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 4,74,735 మంది కరోనాతో మృతిచెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,31,18,87,257 కరోనా డోసులు పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -