వెయ్యికి దిగువన కరోనా కేసులు

84
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 830 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 4,46,45,768కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 21,607 యాక్టివ్ కేసులుండగా 4,40,95,180 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 5,28,981 మంది మృతిచెందారు.

మొత్త కేసుల్లో 0.5 కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.77 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 219.57 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -