చెన్నైలో 24 కిలోల బంగారం స్వాధీనం..

224
Chennai Airport
- Advertisement -

చెన్నై ఎయిర్‌ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు చేపట్టిన సోదాల్లో 24 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరిది దక్షిణకొరియా అని గుర్తించారు.

ఈ బంగారం ఖరీదు రూ.8 కోట్ల వరకూ ఉంటుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారాన్ని మొత్తం సీజ్‌ చేశారు. వీరు హాంకాంగ్‌ నుంచి చెన్నైకు వచ్చారు. ఈ బంగారాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ ప్రాంతానికి తరలిస్తున్నారనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -