దేశంలో 24 గంటల్లో 7219 కరోనా కేసులు..

112
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 7219 కరోనా కేసులు నమోదుకాగా 25 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,44,49,726కు చేరగా 4,38,65,016 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 56,745 యాక్టివ్ కేసులుండగా 5,27,965 మంది మరణించారు. మొత్తం కేసుల్లో 0.13 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.68 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 213.01 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -