గల్ల జయదేవ్, పవన్‌ ‘సోషల్‌ వార్’‌..

259
- Advertisement -

కొద్దికాలం క్రితం వరకు ఒకే పడవలో ప్రయణించి ఇటీవలే దూరమైన తెలుగుదేశం – జనసేనల మధ్య సోషల్ వార్ మొదలైంది. తమకు పక్కలో బల్లెం వలే మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ ఎపిసోడ్‌లో మరో అడుగు ముందుకు వేసి పవన్ తరహాలోనే ట్వీట్టర్ లో ‘సోషల్ వార్’ స్టార్ట్ చేశారు.

మొదట గల్లా జయదేవ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సెటైర్లు వేయగా.. జనసేన అందుకు కౌంటర్లు ఇచ్చింది. ఆ కౌంటర్లకు మళ్లీ జయదేవ్ బదులిచ్చారు. మొదట గల్లా జయదేవ్ తన ట్విట్టర్ ఖాతాలో ‘ కొత్త సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. జగన్-పవన్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి కథ-దర్శకత్వం ప్రశాంత్ కిషోర్ అయితే మోడీ-షా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ చిత్రం విడుదల అవుతుంది..’ అంటూ సెటైరికల్‌గా కొన్ని పంచ్‌లు పేల్చిన విషయం తెలిసిందే.

Galla batteries last long...Pawan says discharged

గల్లా చేసిన ఈ వ్యాఖ్యలకు రెండు రోజుల తర్వాత జనసేన పార్టీ నుంచి ఓ ప్రెస్ నోట్‌ని జనసేన పార్టీ విడుదల చేసింది. ‘వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లా ఒక్కసారి లోక్ సభలో స్పెషల్ స్టేటస్‌పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా. కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు..’ అంటూ జనసేన కౌంటర్ అటాక్ చేసింది.

దీనికి గల్లా జయదేవ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ‘4 సంవత్సరాల నుంచి సుమారు 100 సార్లు స్పీచ్ ఇచ్చాను. అంటే సెంచరీ కొట్టాను. ప్రత్యేక హోదా కోసం మేము కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రిపై యుద్ధం చేస్తూనే ఉన్నాం’ అని గల్లా వ్యాఖ్యానించారు.

అంతేగాక, ‘మరి పవన్ కల్యాణ్ గారు ప్రధానమంత్రిపై ఎందుకు ఆధారపడుతున్నారో? అసలు ఆయన ఎవరితో ఫైట్ చేస్తున్నాడు? ఇక మా బ్యాటరీస్ గురించి చెప్పాలంటే.. అవి ఎప్పుడూ ఫుల్ చార్జింగ్‌తోనే ఉంటాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. నిజంగా అలాగే ఉంటాయి” అంటూ గల్లా చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం అవుతుంది. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూద్దాం.

- Advertisement -