పంజాబ్ బైశాఖి వేడుకల్లో పాల్గొనాలంటూ.. ప్రభాస్‎కి ఆహ్వానాలు…

255
Prabhas flooded with invitations from Punjab
- Advertisement -

బహుబలితో ఒక్కసారిగా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. తాజాగా సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సాహో చిత్రాన్ని చేస్తున్నారు. అయితే పంజాబ్‎లో అత్యంత ఘనంగా జరిగే బైశాఖి పండగ వేడుకల్లో పాల్గొనాలని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‎ని కోరుతూ ఆహ్వానాలు అందుతున్నాయట. పంజాబ్‎లోని కళాశాలలు, యూనివర్శిటీల నుంచి ప్రభాస్‎కు అధిక సంఖ్యలో ఆహ్వానాలు అందుతున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Prabhas flooded with invitations from Punjab

అయితే భారీ బడ్జెట్‎తో తెరకెక్కుతున్న సాహో సినిమా షూటింగ్‎లో బీజీగా ఉన్నారు ప్రభాస్‌. మరీ వాళ్ల ఆహ్వానాలను మన్నించి పంజాబ్ బైశాఖి వేడుకల్లో పాల్గొంటారో లేదో చూడాలి మరీ. కానీ బాహుబలి-2 సినిమా ప్రమోషన్స్‎లో భాగంగా డైరెక్టర్ రాజమౌళి, హీరోలు ప్రభాస్‎ రానాలు బైశాఖి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఆ వేడుకల్లో పాల్గొనాలంటూ ప్రభాస్‎కు ఆహ్వానాలు రావడం గమనార్హం.

- Advertisement -