దేశంలో 24 గంటల్లో 5,664 కరోనా కేసులు

47
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 5,664 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 35 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 4,45,34,188కి చేరగా 4,39,57,929 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 47,922 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 5,28,337 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతానికి చేరగా మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. ఇప్పటివరకు 216.56 కోట్ల వ్యాక్సిన్​ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -