దేశంలో 24 గంటల్లో 5379 కరోనా కేసులు

48
New corona variant
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 5379 కరోనా కేసులు నమోదుకాగా 16 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,44,72,241కి చేరగా 4,38,93,590 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 50,594 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు 5,28,057 మంది కరోనాతో మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.70 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉండగా దేశవ్యాప్తంగా 213.91 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -